నిర్మల్ జిల్లాలో దివ్యాంగురాలి వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకున్న జడ్జి

నిర్మల్ జిల్లాలో దివ్యాంగురాలి వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకున్న జడ్జి

నిర్మల్, వెలుగు: కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఓ దివ్యాంగురాలి వాంగ్మూలాన్ని ఆమె కూర్చున్న కారు వద్దకే వచ్చి నమోదు చేశారు నిర్మల్​ జడ్జి. వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్  జిల్లా లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్  పరిధిలో ఓ క్రిమినల్  కేసుకు సంబంధించి ప్రధాన సాక్షి అయిన సాధు ఇందిరమ్మ మంగళవారం సాక్ష్యం ఇచ్చేందుకు నిర్మల్  కోర్టుకు వచ్చింది.

సాక్షి దివ్యాంగురాలు అని పోలీసుల ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్  జుడీషియల్​ ఫస్ట్  క్లాస్  మెజిస్ట్రేట్  రవీందర్, ఏపీపీ దేవేందర్ తో కలిసి కారు వద్దకే వచ్చారు. న్యాయవాదుల సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.