- కాళేశ్వరం అవకతవకలపై విచారణ వేగవంతం
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ అతి త్వరలోనే మొదలు కానుంది. కాళేశ్వరం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. జూన్ 30లోగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.
గత నెలలో కోల్కతాలో జస్టిస్ ఘోష్తో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్ రావు భేటీ అయ్యారు. వాస్తవానికి ఉగాది అయ్యాక ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో రాలేకపోయారు. లక్ష కోట్ల మేర అవినీతి జరిగిన ప్రాజెక్టుపై విచారణ అంటే సీరియస్గానే ఉంటుందంటూ అధికారులతో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.