ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్

ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్
  • కాళేశ్వరం అవకతవకలపై విచారణ వేగవంతం

హైదరాబాద్​, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ అతి త్వరలోనే మొదలు కానుంది. కాళేశ్వరం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. జూన్​ 30లోగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.

గత నెలలో కోల్​కతాలో జస్టిస్​ ఘోష్​తో ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా, ఈఎన్​సీ (ఓఅండ్​ఎం) నాగేందర్​ రావు భేటీ అయ్యారు. వాస్తవానికి ఉగాది అయ్యాక ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో రాలేకపోయారు. లక్ష కోట్ల మేర అవినీతి జరిగిన ప్రాజెక్టుపై విచారణ అంటే సీరియస్​గానే ఉంటుందంటూ అధికారులతో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.