దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు

హైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య నిందితుల ఎన్ కౌంటర్ పై జ్యుడీషియల్ కమీషన్ దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాల సభ్యులు కమిషన్ ముందు హాజరయ్యారు. పోలీసుల నుండి ప్రాణహాని ఉందని కమిషన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్ కౌంటర్ కుటుంబ సభ్యులు. తమకు తమ రక్షణ కల్పించాలని కమిషన్ ను కోరగా జ్యుడీషియల్ కమిషన్ స్పందించింది. ఎన్ కౌంటర్ గురైన కుటుంబ సభ్యులకు తక్షణమే రక్షణ కల్పించాలని రాష్ట ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలిచ్చింది. రేపు జరిగే విచారణలో మరో 18 మంది సాక్షులను కమిషన్ విచారించనుంది. బాధితుల తరపున హైకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచారి కమిషన్ కు వివరాలు అందించారు.