బతుకమ్మలతో జేపీఎస్​ల నిరసన

బతుకమ్మలతో జేపీఎస్​ల నిరసన

కామారెడ్డిటౌన్​, వెలుగు :  తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మె కామారెడ్డి జిల్లాలో గురువారం కొనసాగింది. కామారెడ్డిలో శిబిరం వద్ద బతుకమ్మలతో నిరసన తెలిపారు.   బీజేపీ నియోజక వర్గ   ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేపీఎస్​ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కలిసి కట్టుగా పోరాడితో ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు.  జేపీఎస్​లు డ్యూటీలో చేరకుంటే తొలగిస్తామని మంత్రి హెచ్చరించడం ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమన్నారు.

.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తేలు శ్రీనివాస్​, మున్సిపల్ ఫ్లోర్​ లీడర్​ మోటూరి శ్రీకాంత్​, లీడర్లు ప్రవీణ్​, నరేందర్, వేణు, రవి, రమేశ్​గౌడ్​ పాల్గొన్నారు.  నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్​లో  జేపీఎస్​ల సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేశ్​   మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో  విఫలమైందని విమర్శించారు. కార్యదర్శులు , ఐకేపీ వీవోఏలు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఈ   కార్యక్రమంలో సీపీఎం నాయకులు నల్వాల నరసయ్య ,  జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు, వివోఏల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.