కాంగ్రెస్​ నేతలతో జూపల్లి భేటీ

కాంగ్రెస్​ నేతలతో జూపల్లి భేటీ

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ మాజీ నేత జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా కాంగ్రెస్​ నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. శనివారం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి, కొల్లాపూర్​ నియోజకవర్గ నేత జగదీశ్వర్​రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. వారి ఇంటికి వెళ్లి పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలిసింది. 2 గం టలకుపైగా వారిద్దరితో సమావేశమైన ట్టు చెప్తున్నారు. మరో వైపు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి కూడా కాంగ్రెస్​లోకి వెళ్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఆయన కూడా మల్లు రవితో భేటీ అయి పార్టీలో చేరే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.