కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: జనంపల్లి అనిరుధ్​ రెడ్డి

కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: జనంపల్లి అనిరుధ్​ రెడ్డి

బాలానగర్, వెలుగు: కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​ రెడ్డి తెలిపారు. మండలంలోని వీరన్నపల్లి, ఉడిత్యాల, సూరారం, గంగాధర్ పల్లి, మేడిగడ్డతండాల్లో శుక్రవారం ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు కాజేస్తున్నారని ఆరోపించారు. 

అర్హులైన నిరుపేదలకు పథకాలు అందడం లేదన్నారు. తండాల్లో సారా బంద్  చేస్తే ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శించారు. గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన  నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.