సైనా బీజేపీలో చేరడంపై జ్వాలా వివాదాస్పద ట్వీట్

సైనా బీజేపీలో చేరడంపై జ్వాలా వివాదాస్పద ట్వీట్

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరడంపై జ్వాలా గుత్తా వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘కారణం లేకుండా ఆడటం మొదటిసారి వింటున్నా అలాగే  కారణం లేకుండానే పార్టీలో చేరడం కూడా ఇప్పుడే వింటున్నా’ అని సైనాని అపహస్యం చేస్తూ జ్వాలా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరింది. సైనా నెహ్వాల్‌తో పాటు ఆమె సోదరి చంద్రన్షు నెహ్వాల్ కూడా బీజేపీలో పార్టీలో చేరారు. సైనా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆమెను చాలామంది ప్రశసించారు. మరికొందరైతే.. టోక్యో ఒలింపిక్స్ దగ్గరపడుతుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేస్తున్నారు. ఇదే విషయంపై బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా కూడా వ్యంగంగా ట్వీట్ చేసింది.

సైనా నెహ్వాల్ పార్టీలో చేరిందని బీజేపీ అధికారికంగా ప్రకటించిన కాసేపటికే గుత్తా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘పెహ్లీ బార్ సునా హై … బెవాజా ఖెల్నా షురూ కియా ఔర్ అబ్ బెవాజా పార్టీ జాయిన్ కియా… ’ అని గుత్తా ట్వీట్ చేశారు.

గుత్తా ట్వీట్ చేసిన వెంటనే.. నెటిజన్లు గుత్తాపై తీవ్ర విమర్శలు చేశారు. బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు, టైటిళ్లు సాధించిన నెహ్వాల్‌ను విమర్శించకూడదని పలువురు నెటిజన్లు గుత్తాకు సూచిస్తూ ట్వీట్ చేశారు. ఎవరి ఇష్టం వారిది.. పక్కవారి ఇష్టాన్ని గౌరవించాలి అని కొందరు, సైనా మీద అసూయతోనే ఇలా చేస్తున్నావని ఇంకొందరు ట్వీట్ చేస్తున్నారు.

సైనా బుధవారం బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తరువాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ సమక్షంలో పార్టీలో చేరారు. తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని ఆమె అన్నారు. దేశం కోసం మోడీ చేసిన కృషిని ఆమె ప్రశంసించారు. దేశం కోసం ప్రధాని మోడీతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు నెహ్వాల్ పేర్కొన్నారు.

For More News..

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన

మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి