
- సత్పలితాలనిస్తున్న సాసర్ పిట్స్
ఆసిఫాబాద్/కాగజ్ నగర్ వెలుగు : అరుదైన వన్యప్రాణులు, జంతు జీవజాలానికి నిలయమైన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ (నీటి గుంటలు) సత్పలితాలనిస్తున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు అడుగంటడంతో అటవీ ప్రాంతాల్లోని వణ్యప్రాణులు ఈ సాసర్ పిట్స్లో దప్పిక తీర్చుకుంటున్నాయి. ఈ నీటి గుంతల్లో ఎప్పటికప్పుడు నీళ్లను అటవీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు.
చిన్న ప్రాణులు మొదలుకొని పులి, జింకలు ఈ సాసర్ పిట్స్లో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కుతున్నాయి. కాగజ్ నగర్ ఎఫ్డీవో సుశాంత్ బోబడే మాట్లాడుతూ.. సహజంగా ఉన్న నీటి వనరులను పరిరక్షిస్తూ మరో 170 నీటి గుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండాకాలంలో వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ నిరంతరం సిబ్బందిని అలర్ట్ చేస్తున్నామని చెప్పారు.