కాకా స్మారక పార్లమెంటు స్థాయి క్రికెట్​ పోటీలు షురూ

కాకా స్మారక పార్లమెంటు స్థాయి క్రికెట్​ పోటీలు షురూ
  • తొలిరోజు మంచిర్యాల, చెన్నూరు జట్ల విక్టరీ 
  • సెంచరీ చేసిన మంచిర్యాల ప్లేయర్​సాయిరెడ్డి

కోల్​బెల్ట్​,వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో మంగళవారం కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్​పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మంచిర్యాల, చెన్నూరు జట్లు ఘన విజయాలు సాధించాయి. తొలిమ్యాచ్​మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల జట్ల మధ్య జరిగింది. 20 ఓవర్లలో మంచిర్యాల మూడు వికెట్లు కోల్పోయి190 రన్స్​చేసింది. 

సాయిరెడ్డి 67 బాల్స్​లో 12 ఫోర్లు, 2 సిక్స్​లతో 103 రన్స్​చేసి నాటౌట్​గా నిలిచాడు. ప్రదీన్​ఏడు ఫోర్లతో 26 బాల్స్​లో 41 రన్స్​, కాజీమ్​28 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన బెల్లంపల్లి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 రన్స్​ మాత్రమే చేయగలిగారు. కుమార్​ 31, సాయికృష్ణ 29 రన్స్​ చేశారు. మంచిర్యాల ప్లేయర్​సాయిరెడ్డి ప్లేయర్​ఆఫ్​ ది మ్యాచ్​అవార్డు దక్కించుకున్నాడు. పోటీల ప్రారంభోత్సవంలో క్యాతనపల్లి మున్సిపల్​వైస్​చైర్మన్​సాగర్​రెడ్డి, కాంగ్రెస్​ లీడర్లు పి.రాఘునాథ్​రెడ్డి, పల్లె రాజు, గోపతి రాజయ్య, ఒడ్నాల శ్రీనివాస్​,  నీలం శ్రీనివాస్​ గౌడ్​, పుల్లూరి కళ్యాణ్​,బింగి శివకిరణ్​, పోటీల నిర్వాహకుడు దుర్గాప్రసాద్​ పాల్గొన్నారు. 

రెండో మ్యాచ్​లో చెన్నూరు విక్టరీ

రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో మధ్యాహ్నం చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గ జట్ల మధ్య మ్యాచ్​జరిగింది. మొదట బ్యాటింగ్​ చేసిన చెన్నూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 రన్స్​చేసింది. భార్గవ్​ 33 బాల్స్​లో 9 ఫోర్లతో 45 రన్స్​, జి.రమేశ్​యాదవ్​29 బాల్స్​లో 4 ఫోర్లతో 43 రన్స్​చేశారు. తర్వాత బ్యాటింగ్​చేసిన పెద్దపల్లి జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 140 రన్స్​చేసింది. రాకేశ్​ 24 బాల్స్​లో 6 ఫోర్లు, 2 సిక్స్​లతో 45 రన్స్​ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్​చేసి ఏడు పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టిన చెన్నూరు ఆటగాడు ఇదునూరి గణేశ్​కు ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్​ దక్కగా క్యాతనపల్లి మున్సిపల్​ కో ఆప్షన్​ మెంబర్​, మాజీ జడ్పీటీసీ యాకుబ్​అలీ అందజేశారు.