కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్యమంత్రి

కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్యమంత్రి

శాంతియుతంగా బండి సంజయ్ దీక్ష చేస్తుంటే పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి సంజయ్ ని అరెస్ట్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్  అరెస్ట్ కి నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. 317 జీవో ఉద్యోగులు, ప్రజలకు వ్యతిరేకమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటింలా మారిందన్న నడ్డా..లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి కేసీఆర్ తన ఫాంహోస్ కు నీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ధర్నాచౌక్  వద్దన్న కేసీఆర్ ధర్నాచౌక్  దగ్గర ధర్నా చేశాడని గర్తు చేశారు. కరోనా విషయంలో గందరగోళం సృష్టించిన కేసీఆర్ మాటలను వీడియో రూపంలో చూపించారు. కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్మమంత్రి అని.. కేసీఆర్ మానసిన పరిస్థితి అదుపు తప్పిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు నడ్డా.