
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. చిత్రా శుక్లా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే మొత్తం షూట్ కంప్లీట్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నాడు.