కల్లూరు, వెలుగు : ఎలాంటి సైడ్ఎఫెక్ట్లేని, సురక్షితమైన, సులభమైన వాసేక్టమీ ఆపరేషన్ ను మగవారు చేయించుకోవాలని కల్లూరు డివిజన్ డిప్యుటీ డీఎంహెచ్ వో ప్రదీప్ బాబు, కల్లూరు పీహెచ్సీ నవ్య కాంత్ లంకాసాగర్, కల్లూరు సీహెచ్సీ సర్జన్ డాక్టర్ రమేశ్ తెలిపారు. తెలగవరం సబ్ సెంటర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి శుక్రవారం కల్లూరు సీహెచ్సీ సర్జన్ రమేశ్ కోత, కుట్టు లేని వాసేక్టమీ ఆపరేషన్ చేసి 2 గంటల్లో సురక్షితంగా చేసి ఇంటికి పంపించినట్లు తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా మగవారు ఈ ఆపరేషన్ కోసం సిద్ధంగా వుంటే స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు చెప్పారు. కుటుంబంలో స్త్రీల మానసిక, శారీరక ఉపశమనం కోసం, సామాజిక బాధ్యతగా మగవారు ముందుకు రావాలని కోరారు.
