కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌లో ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

  కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌లో ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

కామారెడ్డిటౌన్, వెలుగు:  కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 50  ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్​ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్​నాయక్​ఫిర్యాదులు స్వీరించారు. వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు ఇవ్వగా వారితో మాట్లాడి కలెక్టర్​వివరాలు సేకరించారు. ఫిర్యాదులను పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆర్డీవో వీణ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్కూల్స్​స్థితిగతులపై పరిశీలన చేయాలి

ఈ నెల12న నుంచి స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి రీ ఓపెన్ అవుతున్న దృష్ట్యా మండలాల స్పెషల్ ఆఫీసులు, ఎంపీడీవోలు స్కూల్స్​ స్థితిగతులపై పరిశీలన చేయాలని కలెక్టర్​ఆశిశ్​సంగ్వాన్​ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులతో మాట్లాడుతూ..  అవసరమయితే రిపేర్లు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలన్నారు.