
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 50 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్నాయక్ఫిర్యాదులు స్వీరించారు. వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు ఇవ్వగా వారితో మాట్లాడి కలెక్టర్వివరాలు సేకరించారు. ఫిర్యాదులను పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆర్డీవో వీణ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్కూల్స్స్థితిగతులపై పరిశీలన చేయాలి
ఈ నెల12న నుంచి స్కూల్స్ తిరిగి రీ ఓపెన్ అవుతున్న దృష్ట్యా మండలాల స్పెషల్ ఆఫీసులు, ఎంపీడీవోలు స్కూల్స్ స్థితిగతులపై పరిశీలన చేయాలని కలెక్టర్ఆశిశ్సంగ్వాన్ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమయితే రిపేర్లు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలన్నారు.