- ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, దురుసు ప్రవర్తనతో మనస్తాపం?
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ కమిషనర్పర్వతాలు డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే సెలవు పెట్టి వెళ్లారు. కొందరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, లీడర్ల ఒత్తిళ్లు, దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెంది సెలవుపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి నాలుగు రోజుల క్రితం పట్టణ సమస్యలపై తన క్యాంప్ఆఫీసులో మున్సిపల్అధికారులతో రివ్యూ నిర్వహించారు. కాగా తమకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్కు ఎలా వెళ్లావంటూ కమిషనర్ను మున్సిపల్ ప్రజాప్రతినిధి భర్త ప్రశ్నించినట్లు సమాచారం.
సోమవారం మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు సమావేశమై తమకు తెలియకుండా మీటింగ్కు ఎలా వెళ్తావని మళ్లీ ప్రశ్నించటంతో పాటు, పలు అంశాలపై కమిషనర్పై ఆగ్రహ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన కమిషనర్ వెంటనే అడిషనల్కలెక్టర్(లోకల్ బాడీస్) వద్దకు వెళ్లి తాను ఇక్కడ పనిచేయనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత మున్సిపల్ అధికారులకు సిమ్కార్డు అందజేసి లీవ్పై వెళ్లడం చర్చనీయాంశమైంది.
