ఎవరి అంచనాలు వారివే.. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న మున్సిపోల్స్ అభ్యర్థులు

ఎవరి అంచనాలు వారివే.. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న మున్సిపోల్స్ అభ్యర్థులు

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల పోలింగ్​ పక్రియ ముగియటంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  కామారెడ్డి  జిల్లాలో మాత్రం ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపల్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా మెజార్టీ వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎవరి ఓట్లు ఎవరు చిలుస్తారు..? త్రిముఖ పోటీలో  ఏ పార్టీకి మేలు, ఏ పార్టీకి నష్టం అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  త్రిముఖ పోరులో  భాగంగా కొన్ని వార్డుల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. చీలి పోయే 

ఇది ఎవరికి నష్టం, లాభం...

ఎవరికి నష్టం అనే దానిపై  కొంత మంది అభ్యర్థుల్లో  ఆందోళన నెలకొంది.  నాలుగైదు వార్డుల్లో ఇండి పెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్ లు 49 వార్డుల్లో పోటీ పడుతుండగా , బీజేపీ 48 వార్డులు, సీపీఎం 3, ఎంఐఎం8 వార్డుల్లో పోటీ చేసింది.  పోలింగ్​ ప్రక్రియ ముగిసిన తర్వాత కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​లు తమకు వచ్చే సీట్ల సంఖ్యపై ఆరా తీశాయి.   చైర్​పర్సన్ క్యాండిడేట్లకు మ్యాజిక్ ఫిగర్​ చేరుకునే అంశంపై చర్చించుకుంటున్నారు.  శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.