జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

జూన్ 3 నుంచి గ్రామాల్లో  రెవెన్యూ సదస్సులు

కామారెడ్డి, వెలుగు : భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నేటి నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి.  లింగంపేట మండలాన్ని పైలట్​ ప్రాజెక్ట్​గా చేపట్టగా, ఇంకా 24 రెవెన్యూ మండలాల్లోని గ్రామాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు. ఇప్పటికే తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సర్వేయర్లకు దిశానిర్ధేశం చేశారు. ఒక్కో మండలంలో 2 టీమ్​లు ఉంటాయి. ఒక టీమ్ తహసీల్దార్​, మరో టీమ్​ నాయబ్​ తహసీల్దార్​ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.