
కామారెడ్డి, వెలుగు : భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నేటి నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టగా, ఇంకా 24 రెవెన్యూ మండలాల్లోని గ్రామాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఇప్పటికే తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సర్వేయర్లకు దిశానిర్ధేశం చేశారు. ఒక్కో మండలంలో 2 టీమ్లు ఉంటాయి. ఒక టీమ్ తహసీల్దార్, మరో టీమ్ నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.