
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు తాను అండగా ఉంటానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నేతల చేరికలు అని ఆయన విమర్శించారు.. ఆంధ్రాలో పవన్, తెలంగాణలో బండి సంజయ్ని బలహీనపరిచేందుకే జగన్, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని కన్నా ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పై కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. తన వియ్యంకుడు బీఆర్ఎస్లో ఎందుకు చేరాడో సోమువీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో సోము చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.