ఇండియాకి అదానీ చాలా అవసరం .. వెల్లడించిన కాంటర్ ఫిట్జ్‌‌ గెరాల్డ్

ఇండియాకి అదానీ చాలా అవసరం .. వెల్లడించిన కాంటర్ ఫిట్జ్‌‌ గెరాల్డ్

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ  గ్రూపు ఇండియా ఎకానమీకి కీలకమని,  ఇది మౌలిక సదుపాయాలలో కీలక పాత్ర పోషిస్తుందని అమెరికాకు చెందిన కాంటర్ ఫిట్జ్‌‌ గెరాల్డ్ అండ్​ కో   తెలిపింది.    గ్రూప్  ఫ్లాగ్‌‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ షేరు 50  శాతం కంటే ఎక్కువ లాభాలను అందించగలదని బ్రెట్ నోబ్లాచ్,  థామస్ షిన్స్‌‌కే అనే ఎనలిస్టులు పేర్కొన్నారు.

" ఇండియా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని కోరుకుంటోంది. అక్కడికి చేరుకోవడానికి తన ఇంధన ఉత్పత్తిని పెంచడంతోపాటు, డిజిటల్,  భౌతిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టాలి" అని ఫిట్జ్ ​పేర్కొంది. ఈ పెట్టుబడులు ఉత్పాదకత, వృద్ధిని పెంచడానికి అత్యంత ముఖ్యమైనవని అభిప్రాయపడింది. చైనాతో పోటీ పడాలంటే పెట్టుబడులు కీలకమని పేర్కొంది.

భారతదేశ ఆర్థికపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్​) కీలకపాత్ర పోషిస్తుందని కామెంట్​ చేసింది. ఈ సంస్థ చేతుల్లో కీలక వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది.  మార్కెట్ క్యాప్ ఆధారంగా  ఏఈఎల్​ భారతదేశంలో 10వ అతిపెద్ద ఆర్థికేతర పబ్లిక్‌‌ లిస్టెడ్​ కంపెనీ.  " అదానీని పక్కనపెట్టడం కుదరదు. భారతదేశానికి అదానీ  ఎంత అవసరమో, ఈ గ్రూపునకు కూడా భారత్​ అంతే అవసరం అని మేం నమ్ముతున్నాం" అని కాంటర్ పేర్కొంది.