న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ద్వారా ఈసీ భారీ సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. ఓటర్ల జాబితాలను కొందరు మానిప్యులేట్ చేస్తున్నారని, వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు సహాయపడేలా చేపడుతున్నదేనని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో సిబల్ పోస్ట్ పెట్టారు. జార్ఖండ్కు సంబంధించిన మీడియా కథనాన్ని సిబల్ ప్రస్తావించారు. అక్కడ మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను తొలగించాలని బీజేపీ ఏజెంట్లు కోరుతున్నారని ఆరోపించారు.
