ఇప్పటిదాకా మౌనంగా ఉన్నోళ్లే..ఇప్పుడు రాజకీయం చేస్తున్నరు:కపిల్ సిబాల్

ఇప్పటిదాకా మౌనంగా ఉన్నోళ్లే..ఇప్పుడు రాజకీయం చేస్తున్నరు:కపిల్ సిబాల్

న్యూఢిల్లీ: మణిపూర్‌‌ అల్లర్లపై ఇంతకాలం మౌనంగా ఉన్నవారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్‌‌ సిబల్‌‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్‌‌ అంశంపై ప్రతిపక్షాల తీరును విమర్శిస్తూ, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సిబల్​మండిపడ్డారు. మణిపూర్‌‌పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణ కరెక్ట్ కాదన్నారు. 


సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మహిళలపై జరిగిన  హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని మర్చిపోవద్దని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ప్రతిపక్షాలు కాదు, ఇంతకాలం మౌనంగా ఉన్నవారే ‘రాజకీయాలు చేస్తున్నారు’ అని ట్వీట్​ చేశారు.