
- కొత్త, పాత కార్డుల్లో కలిపి 2,31,767 మంది పేర్లు చేరిక
- ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 53,890 కొత్త కార్డులు ఇవ్వగా, కొత్త, పాత కార్డుల్లో కలిపి 2,31,767 మంది పేర్లను చేర్చారు. రేషన్కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని సివిల్సప్లయ్అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదిన్నరేళ్ల పాలలో కొత్త కార్డులు అరకొరగా మంజూరు చేసిన విషయం తెలిసిందే.
చివరి ఐదేళ్లలో ఒక్కటి కూడా జారీ చేయకపోవడంతో కొత్తగా పెళ్లయిన జంటలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూశాయి. కొందరికి కార్డులు ఉన్నప్పటికీ తమ పిల్లల పేర్లు చేర్చకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనతోపాటు మీ సేవ కేంద్రాల్లో అప్లికేషన్లు తీసుకున్న అధికారులు.. రెండు నెలలుగా ఫీల్డ్ లో వెరిఫై చేస్తూ కొత్త కార్డులు ఇస్తున్నారు. పాత కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేరుస్తున్నారు. ఏళ్లుగా రాని రేషన్ కార్డులు ఇప్పుడు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో..
ఏప్రిల్ వరకు 2,76,897 రేషన్ కార్డులు ఉండగా 8,09,596 మంది లబ్ధి పొందారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక కార్డుల సంఖ్య 2,97,953కు చేరగా 8,99,732 మంది లబ్ధి పొందుతున్నారు.
జగిత్యాల జిల్లాలో..
ఏప్రిల్ వరకు 3,07,096 రేషన్ కార్డులు ఉండగా 8,98,262 మంది లబ్ధి పొందారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3,25,301 కార్డులు, 8,99,732 మంది లబ్ధిదారులకు
చేరింది.
పెద్దపల్లి జిల్లాలో..
ఏప్రిల్ వరకు 2,19,711 రేషన్ కార్డులు, 6,30,965 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2,25,999 కార్డులు, 6,70,396 మంది లబ్ధిదారులకు చేరింది.
రాజన్న సిరిసిల్లలో..
జిల్లాలో గతంలో 1,73,577 రేషన్ కార్డులు ఉండగా 5,02,673 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1,81,918కి, లబ్ధిదారుల సంఖ్య 5,43,805 మందికి చేరింది.
జిల్లాల వారీగా కొత్త కార్డులు, లబ్ధిదారులు
జిల్లా కార్డులు
కరీంనగర్ 21,056 90,136
జగిత్యాల 18,205 61,068
పెద్దపల్లి 6,288 39,431
రాజన్న సిరిసిల్ల 8,341 41,132
మొత్తం 53,890 2,31,767