కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల విద్యార్థులకు ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బైపాస్లోని మైనారిటీ గురుకుల బాయ్స్ స్కూల్, కాలేజీ 1లో ఈ పోటీలను డీఐఈవో గంగాధర్, మైనారిటీ గురుకులాల కోఆర్డినేటర్ విమల ప్రారంభించారు. కరీంనగర్ సీఈవో, గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ వీర్ల మహేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని తెలిపారు. క్రీడల వల్ల క్రమశిక్షణతోపాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ అక్రమ్పాషా, ప్రిన్సిపాల్స్సంపత్, చంద్రమోహన్, కుమారస్వామి, అకాడమిక్ కో ఆర్డినేటర్ మహమ్మద్ మీరాజ్, డిప్యూటీ వార్డెన్స్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
