అలుగునూర్ లోని ‘కాకా మెమోరియల్’ విన్నర్.. కరీంనగర్

అలుగునూర్ లోని  ‘కాకా మెమోరియల్’ విన్నర్.. కరీంనగర్

తిమ్మాపూర్, వెలుగు: అలుగునూర్ లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్​లో హెచ్​సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కాకా మెమోరియల్​ టీ-20 ఫేజ్–1 విన్నర్​గా కరీంనగర్​ జట్టు నిలిచింది. 

శుక్రవారం కరీంనగర్-, రాజన్న సిరిసిల్ల జిల్లా జట్ల మధ్య ఫైనల్​ మ్యాచ్​నిర్వహించగా.. రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​టాస్​వేసి మ్యాచ్​ను ప్రారంభించారు. టాస్ గెలిచిన కరీంనగర్ జట్టు మొదట బాటింగ్ కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఈ జట్టులో రిత్విక్ సూర్య 91 పరుగులు చేశాడు. 

అనంతరం బ్యాటింగ్​కు దిగిన రాజన్న సిరిసిల్ల జట్టు 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఇర్షాద్ పాషా 3 వికెట్లు హర్షద్, సార్థక్ రెండేసి వికెట్లు తీశారు. అత్యధిక పరుగులు చేసిన కరీంనగర్​ బ్యాటర్​ సూర్యకు  హెచ్​సీఏ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, అడ్​హక్ కమిటీ చైర్మన్ ప్రకాశ్​చంద్ జైన్, సీనియర్ మెంబర్ ధన్ రాజ్ జైన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు. 

ఉమ్మడి జిల్లా జట్టు ఇదే..

రాష్ట్రస్థాయిలో ఆడనున్న కరీంనగర్​ఉమ్మడి జిల్లా క్రికెట్​ జట్టును కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్​ జనరల్​సెక్రటరీ ఎన్. మురళీధర్ రావు ప్రకటించారు. రితిక్​ సూర్య, అక్డం, తక్షిల్, విజ్ఞేశ్, నితిన్ రెడ్డి, రాజు, శ్రీకాంత్​ రెడ్డి, రాహుల్, సాయికిరణ్, సాత్విక్, సార్థక్, అర్షద్, సాయిగణేశ్​ ఎంపికయ్యారని చెప్పారు. 

వీరితోపాటు హైదరాబాద్​కు చెందిన మరో ఐదుగురు సభ్యులతో కలిపి మొత్తం18 మంది ఆడనున్నట్లు తెలిపారు. సంఘం అధ్యక్షుడు ఆగంరావు, ఉపాధ్యక్షులు మహేందర్​ గౌడ్, మనోహర్​ రావు, ట్రెజరర్ శ్రవణ్, ఎగ్జిక్యూటివ్​మెంబర్స్​అజిత్, హరికృష్ణ, సాగర్​తదితరులు పాల్గొన్నారు.