దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ,వీకెండ్ లాక్ డౌన్ ఉంది. కానీ వీటితో ఫలితం లేదనుకున్న కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నాయి. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కర్ణాటక చేరింది. మే 10 ఉదయం 6 గంటల నుంచి మే 24ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర సీఎం యాడ్యురప్ప. కరోనా కర్ఫ్యూ వల్ల ఫలితం లేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.వలస కార్మికులు ఎక్కడికి వెళ్లిపోవద్దన్నారు. అన్ని హోటళ్ళు, పబ్బులు, బార్లు మూసివేయబడతాయన్నారు. తినుబండారాలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే తెరిచి ఉంటాయన్నారు.
As #COVID19 cases are surging in the state, corona curfew was not successful. So, a complete lockdown will be imposed from 10th May 6 am to 24th May 6 am. All hotels, pubs and bars will remain closed. Eateries, meat shops & vegetable shops can operate from 6-10 am: Karnataka CM pic.twitter.com/orfPNGj0sD
— ANI (@ANI) May 7, 2021