కర్ణాటక ఆరోగ్య మంత్రి కె. సుధాకర్కు కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. " కరోనా మూడో విడతల్లో విజృంభించినప్పటికీ.. నాకు ఇప్పటి వరకూ సోకలేదు. తాజాగా COVID-19 పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది. లక్షణాలు కూడా ఉండడంతో, ఇంట్లోనే అందరికీ దూరంగా ఉంటూ, కరోనా నిబంధనలనలను పాటిస్తాను. నేను కరోనా రెండు టీకాలూ వేసుకున్నాను." అని ఆయన ట్వీట్ ద్వారా సమాచారాన్ని చేరవేశారు. "గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు పరీక్షించుకోమని ఆయన అభ్యర్థించారు.
కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కర్ణాటకలో గురువారం 297 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.45 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా ఒక్క బెంగళూరులోనే 276 కేసులు నమోదు కావడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నయ్
కోచింగ్ లేకున్నా జాబ్ కొట్టొచ్చు