భార్యతో కలసి రోడ్డును శుభ్రం చేసిన మంత్రి

భార్యతో కలసి రోడ్డును శుభ్రం చేసిన మంత్రి

బెంగళూరు: వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లెక్చర్లు ఇచ్చే నాయకులు చాలా మంది ఉంటారు. కానీ చెత్తతో నిండిన రోడ్డును క్లీన్ చేసి స్ఫూర్తిగా నిలిచే నేతలను అరుదుగా చూస్తుంటాం. కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి ఎస్.సురేష్​ కుమార్ ఆ కోవలోనే వస్తారు. మంత్రి సురేష్ ఉంటున్న ఏరియాకు పౌర కార్మిక ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్న లింగమ్మ అనే మహిళ కాలి గాయంతో బాధపడుతోంది. దీంతో విషయం తెలుసుకున్న సురేష్.. రోడ్డును క్లీన్ చేయడానికి స్వయంగా తానే రంగంలోకి దిగారు. ఆయన తన భార్యతో కలసి రోడ్డుపై ఉన్న పువ్వులు, చెత్తను శుభ్రపరిచారు. మంత్రి కృషిని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) కమిషనర్ బి.హెచ్. అనిల్ కుమార్ మెచ్చుకున్నారు. మంత్రి సురేష్ ఆయన భార్య రోడ్ శుభ్రం చేస్తున్న ఫొటోలను అనిల్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.