ఉద్రిక్తతల నడుమ కూడా కర్తాపూర్​ కారిడార్​ ఓపెన్

ఉద్రిక్తతల నడుమ కూడా కర్తాపూర్​ కారిడార్​ ఓపెన్

చండీగఢ్: పహల్గాం దాడి వల్ల భారత్–-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగినప్పటికీ, పంజాబ్​లోని గురుదాస్​పూర్​ జిల్లా డేరా బాబా నానక్​ వద్ద ఉన్న కర్తాపూర్ కారిడార్  తెరిచే ఉందని టూరిస్టులు తెలిపారు. ఇది భారతీయ సిక్కు యాత్రికులకు పాకిస్తాన్‌‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తాపూర్​కు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నది.

 ఈ కారిడార్ 2019లో ప్రారంభమైంది. ఇది డేరా బాబా నానక్‌‌ను.. పాకిస్తాన్‌‌లోని కర్తాపూర్​తో అనుసంధానిస్తుంది. అయితే, పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్​కు వెళ్లే అటారీ బోర్డర్​ను భారత్​ మూసివేసినా.. శుక్రవారం కర్తాపూర్​ కారిడార్​ మాత్రం తెరిచే ఉందని యాత్రికులు శుక్రవారం పేర్కొన్నారు.