కార్తీకమాసం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీకమాసంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లోని దుండిగల్ నుంచి అరుణాచలం, వేములవాడ, శ్రీశైలం వంటి వివిధ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ప్యాకేజ్లను ప్రకటించారు..
అరుణాచలం టూర్ : మూడు రోజులు
పర్యాటక ప్రదేశాలు : అరుణా చలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి క్షేత్రాలు
ప్యాకేజీ ఛార్జీల వివరాలు : పెద్దలకు రూ. 4,500, పిల్లలకు రూ. 2,400
శ్రీశైలం టూర్ ప్యాకేజ్ : ఒక్క రోజు ...
పర్యాటక ప్రదేశాలు : మైసిగండి, శ్రీశైలం డ్యామ్, శిఖరం శ్రీశైలం
ప్యాకేజీ ఛార్జీల వివరాలు : పెద్దలకు రూ. 1, 500....పిల్లలకు రూ. 900
విజయవాడ టూర్ ప్యాకేజ్ : ఒక్క రోజు ...
పర్యాటక ప్రదేశాలు : చెరువుగట్టు, విజయవాడ దుర్గమ్మ గుడి
ప్యాకేజీ ఛార్జీల వివరాలు : పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 850
వేములవాడ టూర్ ప్యాకేజ్ : ఒక్కరోజు
పర్యాటక ప్రదేశాలు : ధర్మపురి, కొం డగట్టు, వేములవాడ
ప్యాకేజీ ఛార్జీల వివరాలు : పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 650
జోగులాంబ మంత్రాలయం టూర్ ప్యాకేజ్...: ఒక్కరోజు
పర్యాటక ప్రదేశాలు : జోగులాంబ అమ్మవారి దర్శనం, కూలబ్రహ్మేశ్వర స్వామిగుడి, పురాతన శివాలయం, బీచ్పల్లి హనుమాన్ టెంపుల్, రాఘవేంద్రస్వామి వేంకటేశ్వర స్వామి టెంపుల్
ప్యాకేజీ ఛార్జీల వివరాలు : పెద్దలకు రూ. 1950, పిల్లలకు రూ. 700
ఇక, ఇతర ప్యాకేజ్లు కూడా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9958226150, 7671014280, 9866283555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
