
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కాసేపటి క్రితం బీఆర్ఎస్ లో చేరారు. ఇవాళ ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ గారు నాకు పాత మిత్రులు, ఎప్పుడో రావాల్సింది మీదగ్గరికి కాస్త లేటైంది. ముందుగానే వస్తే బండ ప్రకాష్ తో పాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవా డిని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
మనస్పూ ర్తిగా స్వాగతం తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తాం. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈటలరాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పె ద్దనాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.