కాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో యువకుడు మృతి.. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్

కాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో  యువకుడు మృతి..  వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్

కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కలిసి కాశ్మీర్ ​యాత్రకు వెళ్లారు. అక్కడ గురువారం గుండెపోటుతో విశాల్ చనిపోయినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  యాత్రలో భాగంగా లడఖ్​ ప్రాంతంలో ఆక్సిజన్ ​అందకపోవడంతో ఒక్కసారిగా విశాల్ కు  ఊపిరి ఆడక మృతి చెందిన్నట్లు చెప్పారు. డెడ్ బాడీ కోసం బంధువులు, ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు.