
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ ఎం లీడ్ రోల్స్లో విజయేందర్ ఎస్ రూపొందిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘కత్తందుకో జానకి’ ఐకానిక్ డైలాగ్ను రీమిక్స్ చేసి ఈ పాటను డిజైన్ చేశారు.
నేటి యువత అలవాట్లను చెప్పుకుంటూ సాగే ఈ పాటను ఆర్ఆర్ ధృవన్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, ఆర్ఆర్ ధృవన్ కలిసి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ను అమలాపురంలోని కిమ్స్ కాలేజ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.