హైదరాబాద్, వెలుగు: సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. తమ సంస్థ వ్యాపార ప్రకటనలో ఆమె కనిపిస్తారని సంస్థ తెలిపింది.
కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ కునాల్ మాట్లాడుతూ ‘విజయవాడలో మా షోరూం ఉంది. బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ, విక్రయాలు మా ప్రత్యేకతలు. ప్రతి నగకూ సర్టిఫికేట్ను అందిస్తాం. సంప్రదాయ ఆభరణాలతోపాటు, డైమండ్ రింగులు, నెక్లెస్లు, చెవిపోగులు, పెళ్లి ఆభరణాలు అమ్ముతాం”అని ఆయన వివరించారు.
