నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఇవాళ మధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసమండలి దర్బార్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నెల 9న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత విజయం సాధించారు.