శివకుమార్ ను అడ్డుకోవడం బీజేపీ కుట్ర

శివకుమార్ ను అడ్డుకోవడం బీజేపీ కుట్ర

కర్నాటక సర్కారును అస్థిరపర్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు కర్నాటక కాంగ్రెస్ ఇంచార్జ్ కేసీ.వేణుగోపాల్. ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ లోకి వెళ్లకుండా శివకుమార్ ను అడ్డుకోవటాన్ని తప్పుబట్టారు. బీజేపీ కుట్రలో భాగంగానే శివకుమార్ ను హోటల్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడి వెళ్లరని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మహారాష్ట్ర పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు వేణుగోపాల్.