- మాస్కులేమాయె..డిస్టెన్స్ ఎటుపాయె?
- గుంపులు గుంపులుగా ఆ జనమేంది?
హైదరాబాద్/ సిద్దిపేట, వెలుగు: ‘‘చావుకు 20 మంది.. పెండ్లికి 50 మంది.. కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి మాత్రం 1500 మందినా..?’’ అంటూ రాసిన ఓ పోస్టు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం, ఈ సందర్భంగా నిర్వహించిన యాగాల్లో మాస్కులు పెట్టుకోకపోవడమేగాక ఫిజికల్ డిస్టెన్స్ పాటించని సీఎం కేసీఆర్, చినజీయర్స్వామి, మంత్రులు, ఇతర నాయకులు ఫైన్ కడతారా?’’ అంటూ పెట్టిన మరో పోస్టు ఫేస్బుక్, వాట్సప్లో చక్కర్లు కొడుతోంది. ‘‘లాక్డౌన్ టైమ్లో పెట్టిన రూల్స్ ప్రజలు పాటించేందుకేనా..? ప్రభుత్వ పెద్దలకు పట్టదా?”అంటూ రకరకాల పోస్టులతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
శుక్రవారం కొండపోచమ్మసాగర్ ఎత్తిపోతల కార్యక్రమానికి సుమారు 1500 మంది రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. వీళ్లతోపాటు బందోబస్తు డ్యూటీలోని పోలీసులు, ఇతర అధికారులు, సిబ్బంది, యాగాలు నిర్వహిచేందుకు వచ్చినవాళ్లు మరింత మంది ఉంటారు. మోటార్ల స్విచ్ ఆన్, కొండపోచమ్మ ఆలయంలో పూజలు, యాగాలు తదితర కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, చినజీయర్స్వామితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని యూట్యూబ్లోని న్యూస్ చానళ్లలో లైవ్చూసినవాళ్లు.. ఇలా భారీ జన సమీకరణపై సెటైర్లు పోస్టు చేశారు. ‘‘లాక్ డౌన్ రూల్స్ పాటించాలని, గుంపులుగా ఉండొద్దని పదేపదే చెప్పే ప్రభుత్వ పెద్దలే సభ్య సమాజానికి ఇప్పుడు ఏం మెస్సేజ్ ఇస్తున్నట్లు? మాస్కులు పెట్టుకోకపోవడమేంది? ఫిజికల్ డిస్టెన్స్ ఎటుపోయింది? గుంపులుగా గుంపులుగా వెళ్లడమేంది? నారాయణఖేడ్లో మాదిరిగానే కొండ పోచమ్మ గురించి వార్తలు రాసే రిపోర్టర్ల కొంపలు కూల్చేస్తరా?’’ అనే ప్రశ్నలు కామెంట్స్ రూపంలో కనిపించాయి. ‘‘రాష్ట్రంలో పలుప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోని సుమారు 40 వేల మంది దగ్గర ఫైన్లు వసూలు చేసిన అధికారులు.. వీళ్ల దగ్గర వసూలు చేస్తారా’’ అనే చాలెంజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
లాక్డౌన్లో ఆలయం ఓపెనేంది?
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు మూసి వేసి భక్తుల సందర్శనను పూర్తిగా నిలిపివేస్తే.. శుక్రవారం సీఎం రాకతో మాత్రం కొండపోచమ్మ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయ ఆవరణలో రెండు జంటలతోనే డిస్టెన్స్ పాటిస్తూ చండీ యాగాన్ని నిర్వహించినా.. సీఎం రాగానే ఆ డిస్టెన్స్ కనిపించలేదు. అక్కడికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం మాస్క్ లు పెట్టుకోకపోవడం, డిస్టెన్స్ పాటించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
జస్ట్ ఆరేళ్లలోనే బంగారు తెలంగాణ చేశాం