కేసీఆర్ది దుర్మార్గపు ఆలోచన... ప్రొ.జి.హరగోపాల్

కేసీఆర్ది  దుర్మార్గపు ఆలోచన... ప్రొ.జి.హరగోపాల్

హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ది దుర్మార్గపు ఆలోచనని ప్రొ.జి.హరగోపాల్ అన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొ.జి.హరగోపాల్ కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధికార దాహంతో కేసీఆర్ నియంతలా వ్యవహిరిస్తున్నారన్నారు. రాష్ట్రం రాకముందు పౌరహక్కులు కాపాడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తానే ఆ హక్కులను హరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి కేసీఆర్ కు లేదన్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్నాయన్న హరగోపాల్...దేశ జనాభాలో ఒక్క శాతం ఉన్న వారి దగ్గర 56 శాతం సంపద ఉన్నదన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటిని అమ్ముతూ కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టింస్తుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం

ఎవరు మీలో కోటీశ్వరులు.. ఐపీఎల్ వేలానికి వేళాయెరా!