రాజ్యాధికారంతోనే దళితుల బతుకుల్లోవెలుగులు

రాజ్యాధికారంతోనే దళితుల బతుకుల్లోవెలుగులు
  • 56వ రోజుకు చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాధికార యాత్ర
  • కేసీఆర్ దొరల పాలన చేస్తున్నారు

ఖమ్మం జిల్లా: రాజ్యాధికారంతోనే దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతాయన్నారు బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్ధినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ చేపట్టిన రాజ్యాధికార యాత్ర 56వ రోజుకు చేరింది. 

యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం నాచారంలో ప్రజలనుద్దేశించి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.  అందరం ఓట్లేసి గెలిపిస్తే రాజమందిరంలో కూర్చుని బయటకు రావడం లేదన్నారు. ఒక్క గిరిజనులనే కాదు అన్ని వర్గాల వారిని కేసీఆర్ మోసం చేశారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత