మరో ముగ్గురికి ​బీఫాంలు ఇచ్చిన కేసీఆర్

మరో ముగ్గురికి  ​బీఫాంలు ఇచ్చిన కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గురువారం మరో ముగ్గురికి బీఫాంలు అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్), ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు (మిర్యాలగూడ)కు ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో బీఫాంలు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ బీఫాంలు ఇచ్చిన వారి సంఖ్య 107కు చేరింది. ఇంకో 12 మంది అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాల్సి ఉంది.