రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బ తీస్తున్నయ్ : ఎమ్మెల్యే పాయల్ శంకర్

రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్,  బీఆర్ఎస్ దెబ్బ తీస్తున్నయ్ : ఎమ్మెల్యే పాయల్ శంకర్
  •     ఎమ్మెల్యే పాయల్​ శంకర్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ తాము ప్రతిపక్షమని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం బీఆర్ఎస్, ​-కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్​శంకర్​ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

గతంలో బీఆర్ఎస్​అధికారంలో ఉన్నప్పుడు రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఆక్రమించుకుందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం అదే కొనసాగిస్తోందని విమర్శించారు. రైతులకు సంబంధించిన విజయ డెయిరీ భూమిని కాంగ్రెస్ కు అప్పగించే ప్రయత్నానికి బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మద్దతు తెలపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి రైతుల భూమిని కాపాడాలని కోరారు.