స్పౌజ్ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్

స్పౌజ్ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: జోనల్ సిస్టం, ఉద్యోగుల విభజనలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించింది. స్పౌజ్, పరస్పర బదిలీలు, ఉద్యోగులు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ వెల్లడించారు. బుధవారం ప్రగతి భవన్ లో  సీఎంతో భేటీ అయి, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వీటిపై నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారని తెలిపారు.