మహబూబ్నగర్ : టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

మహబూబ్నగర్ : టీఆర్ఎస్  జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ... సింధు హోటల్ సమీపంలో  కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఉన్నారు.  కాసేపట్లో  నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.  

ఆ తరువాత లంచ్ ఉంటుంది. భోజనం అనంతరం మధ్యాహ్నం 3.50 నిమిషాలకు  జిల్లా అధికారులతో సీఎం సమావేశం అవుతారు.  ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి  ప్రగతిభవన్ కు చేరుకుంటారు.