కేసీఆర్, కేటీఆర్​లు.. మోడీ కాలిగోటికి సరిపోరు : డీకే అరుణ

కేసీఆర్, కేటీఆర్​లు.. మోడీ కాలిగోటికి సరిపోరు : డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్, కేటీఆర్​లు ప్రధాని మోడీ కాలిగోటికి కూడా సరిపోరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ మండిపడ్డారు. మోడీ, సంజయ్, కిషన్​రెడ్డిలపై కేటీఆర్​ చేసిన కామెంట్లను ఖండిస్తూ ఆమె మంగళవారం ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోడీని విమర్శిస్తున్న వాళ్లు.. అసలు ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇస్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ బియ్యాన్ని పంపించినా.. రాష్ట్ర సర్కారు ఎందుకు పంపిణీ చేయడం లేదని నిలదీశారు. మోడీ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడని, ఆయనకు దేశమే కుటుంబమని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అవినీతి కంపులో దొర్లుతున్నదని విమర్శించారు. కవిత లిక్కర్ స్కామ్, కేటీఆర్ డ్రగ్స్ స్కాం, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్​లో ఉన్నారని ఆరోపించారు. ఏదో ఒక రోజు కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒకే చోట చిప్పకూడు తినడం ఖాయమని పేర్కొన్నారు.