గన్‌పార్క్ దగ్గర నివాళులర్పించిన కేసీఆర్

గన్‌పార్క్ దగ్గర నివాళులర్పించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గన్ పార్క్ దగ్గర నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ వెంటే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారు. అమరవీరుల స్థూపానికి సీఎంతో పాటు నేతలు, అధికారులు కూడా నివాళులర్పించారు. అంతకుముందు కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండా ఎగుర వేశారు.