సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఐదురోజుల పాటు హస్తినలో బిజీబిజీగా గడిపిన కేసీఆర్.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టాయి. రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం పత్తా లేకుండా పోయారని పేర్కొన్నాయి. మంత్రి కేటీఆర్ కూడా ఇంటికే పరిమితం అయ్యారంటూ ఆరోపణలు గుప్పించాయి.