- పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్ సాయంతో స్పీకర్ చాంబర్కు వెళ్లారు. అసెంబ్లీ సిబ్బంది వీల్ చైర్ సమకూర్చినా ఆయన వాకర్సాయంతో నడుచుకుంటూనే వెళ్లారు. స్పీకర్ చాంబర్లో స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభినందించారు. స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్కేసీఆర్కు ఎమ్మెల్యే కిట్బ్యాగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఐడెంటిటీ కార్డు అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ స్పీకర్పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆఫీసర్లాంజ్లో గల మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి కేసీఆర్నివాళి అర్పించారు. బెంజ్కారులో అసెంబ్లీకి వచ్చిన ఆయన తిరిగి అదే కారులో నందినగర్లోని తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేలు ట్రాప్లో పడొద్దు
నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరూ అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేతల ట్రాప్లో పడవద్దని, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. అయితే ఎమ్మెల్యేలు సీఎంను కలువాలనుకుంటే పార్టీకి ముందే సమాచారం ఇవ్వాలన్నారు. త్వరలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలన్నారు. ఇకపై వారంలో రెండు రోజులు ప్రజలు, నాయకులను కలుస్తానని తెలిపారు.