- సొంతింటికి కేసీఆర్ ..
- యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
- తొమ్మిదిన్నరేండ్ల తర్వాత నందినగర్లోని నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్
- దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలు
హైదరాబాద్, వెలుగు : యశోద హాస్పిటల్నుంచి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్నుంచి కుటుంబ సభ్యులు ఆయనను నందినగర్లోని నివాసానికి తీసుకెళ్లారు. హాస్పిటల్నుంచి వీల్చైర్లో బయటకు వచ్చిన కేసీఆర్ వాకర్, కుటుంబ సభ్యులసాయంతో కారులోకి ఎక్కారు. బంజారాహిల్స్లోని నంది నగర్నివాసానికి చేరుకున్న ఆయన కారు నుంచి దిగి వీల్చైర్లో ప్రధాన ద్వారం వరకు వచ్చారు. దిష్టితీసి గుమ్మడి కాయ కొట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. వాకర్సాయంతో ఆయన ఇంట్లోకి వెళ్లారు.
ఈనెల 7న అర్ధరాత్రి ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్జారి పడటంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. 8న సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్డాక్టర్లు ఆయనకు ఆపరేషన్చేశారు. ఎనిమిది రోజుల పాటు యశోద హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు డైలీ మెడికల్ఫాలో అప్, ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
2014 జూన్2న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి బేగంపేట క్యాంపు ఆఫీస్కు షిఫ్ట్అయ్యారు. 2016 నవంబర్లో ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయ్యాక అందులోకి నివాసం మార్చారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రకటించగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ అదే రోజు ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్కు వెళ్లిపోయారు.
ఇప్పుడు హిప్రీ ప్లేస్మెంట్సర్జరీ చేయించుకొని విశ్రాంతి కోసం నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత కేసీఆర్ తన సొంత ఇంటికి తిరిగివచ్చారు. కాగా, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్లో ఆకాంక్షించారు.