
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్ర రైతులకు ఏమీ చేయలేనోడు దేశంలోని రైతులకు ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. తామర తెగులు సోకి అకాల వర్షాలకు మిర్చి రైతు నష్టపోతే ఆదుకోవాల్సిన సర్కార్ పరామర్శతోనే సరిపెట్టుకొంటే సాయం కోసం ఎదురుచూసిన మిర్చి రైతులు పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే మూడు నెలల్లోనే 17 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మీ రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరగొచ్చు, గ్రూపులు కట్టొచ్చు కానీ చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోరని విమర్శించారు. మీ బంగారు తెలంగాణ బూటకమౌతుందని వారిని పరామర్శించడం లేదా? అని ప్రశ్నించారు. సొంత రాష్ట్ర రైతు అవస్థ తీర్చలేని మీరు దేశంలోని రైతులందరికీ ఏం సమాధానం చెప్తారు ? అని నిలదీశారు.
తామర తెగులు సోకి,
— YS Sharmila (@realyssharmila) March 1, 2022
అకాల వర్షాలకు మిర్చి రైతు నష్టపోతే
ఆదుకోవాల్సిన సర్కార్ పరామర్శతోనే సరిపెట్టుకొంటే,
సాయం కోసం ఎదురుచూసిన మిర్చి రైతులు
పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక
ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు.
ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే మూడు నెలల్లోనే 17 మంది మిర్చి 1/2
ఇవి కూడా చదవండి
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు
‘కచ్చా బాదామ్’ సింగర్కు యాక్సిడెంట్