‘‘బిర్యానీ కావాలంటూ ’’బుడ్డోడి రిక్వెస్ట్..అంగన్ వాడీ మెనూనే సవరించిన మంత్రి

‘‘బిర్యానీ కావాలంటూ ’’బుడ్డోడి రిక్వెస్ట్..అంగన్ వాడీ మెనూనే సవరించిన మంత్రి

కేరళలో ఓ చిన్నారి రిక్వెస్ట్ ని అక్కడి ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దమైంది.‘‘అంగన్ వాడీలో రోజూ ఉప్మా పెడుతున్నారు.. నాకు ఇష్టం లేదు.. మెనూ మార్చండి’’ అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇది జరిగింది. చిన్నారి తల్లి సోషల్ మీడియాలో సరదాగా చేసిన పోస్ట్ కు స్పందించిన కేరళ శిశు సంక్షేమ శాఖ నిజంగా స్పందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.

కేరళకు చెందిన త్రిజల్ఎస్ సుందర్ ముద్దు పేరు శంకు ఓ రిక్వెస్ట్ చేశారు. అంగన్ వాడీలో ఎప్పుడు ఉప్మా పెడుతున్నారు. మెనూలో దానికి బదులుగా చికెన్ బిర్యానీనో, చికెన్ ఫ్రైనో పెట్టమని కోరాడు. అది శంకు తల్లి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయి చివరికి మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి చేరింది. 

శంకు రిక్వెస్ట్ నిజంగానే సీరియస్ గా తీసుకున్న కేరళ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ అంగన్ వాడీ మెనూ మారుస్తూ మోడల్ ఫుడ్ మెనూను విడుదల చేశారు. మంగళవారం(జూన్ 3)పతనం తిట్టలో జరిగిన అధికారిక సమావేశంలో అంగన్ వాడీ మెనూ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

మెనూ చక్కెర, ఉప్పు తీసుకోవడం తగ్గించడం, పోషక ప్రమాణాలతో పెరుగుదలకోసం ఎక్కువ కాలరీలు, ప్రోటీన్ల చేర్చాలనే ఉద్దేశ్యంతో అంగన్ వాడీ మెనూ పులావ్ చేర్చారు. మునుపటిలా కాకుండా గుడ్డు, పాలు మూడు రోజులు అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్, భోజనం, స్నాక్స్ మెనూ ఆధారంగా అందిస్తామని చెప్పారు. కేరళలో ఏకీకృత ఆహార మెనూ అమలు చేయడం ఇదే మొదటిసారి. 

శంకు ప్రస్తుతం ఖతార్ లో అతని పేరెంట్స్ కలిసి ఉన్నాడు. చాలారోజులుగా ఖతార్ లో ఉంటున్న తండ్రి దగ్గర వేసవి సెలవులకు వెళ్లిన శంకు అక్కడ అంగన్ వాడీ మెనూ గురించి ఇలా కామెంట్ చేయగా అతని తల్లి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. 

శంకు తల్లి ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘‘ఈ వీడియోను ఉద్దేశ్యపూర్వకంగా షేర్ చేయలేదు.. కేవలం సరదాకోసం మాత్రమే చేశాను అని చెప్పింది. ఇక నెట్టింట వైరల్ అయిన ఈ వీడియో కేరళ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆమె నిజంగానే అంగన్ వాడీ మెనూలో మార్పుచేయడం చర్చనీయాంశమైంది.

కొసమెరుపేంటంటే బుధవారం తెలంగాణ శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా అంగన్ వాడీ మెనూ వారానికి మూడు రోజుల పాటు ఎగ్ బిర్యానీ మెనూను ప్రకటించడం కోఇన్సిడెంట్.. ఏదీఏమైనా బుడ్డోడు చేసిన రిక్వెస్ట్ బాగా వర్కవుట్ అయిందని నెటిజన్లు అంటున్నారు.