విచారణ పేరుతో జర్నలిస్టుల ఫోన్లు సీజ్చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభంలో భాగమని తెలిపింది. ఏదైనా కేసులో వారి ఫోన్ అవసరమైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) నిబంధనలను అనుసరించాలని కోర్టు తెలిపింది. ఓ యూట్యూబర్పై స్థానిక ఎమ్మెల్యే వేసిన కేసులో తనకు సంబంధం లేకపోయినా పోలీసులు వేధించారని జి. విశాఖన్ అనే మలయాళ జర్నలిస్టు ఆరోపించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు జరిపి ఫోన్ సీజ్ చేశారని హైకోర్టును ఆశ్రయించాడు.