కేరళలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడు నెట్టివేయడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి కింద పడి ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టిటిఇ) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం(ఏప్రిల్ 2) రాత్రి 7 గంటల సమయంలో ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్లే రైలు ఎస్11 కోచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన టీటీఈని ఈకే వినోద్గా పోలీసులు గుర్తించారు. టికెట్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సహనం కోల్పోయిన ప్రయాణికుడు.. నెట్టడంతో టీటీఈ కదులుతున్న రైలు నుండి పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
The incident took place in the S11 coach of Ernakulam-Patna Express at Velappaya (Thrissur), between Mulangunnathukavu and Wadakkanchery Railway Stations.
— ANI (@ANI) April 2, 2024